
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 14వ తేదీన పునరంకిత సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించేందుకు ఈ సభను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ, ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, మంత్రులు ఆ సభలో పాల్గొంటారని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల కోసం ఆయన పార్టీ కార్యాలయం గాంధీభవన్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి మొదటి ఫోన్ కరీంనగర్ లోకసభ పార్టీ అభ్యర్థి టి. జీవన్ రెడ్డికి చేశారు.
No comments:
Post a Comment