
తనకు పరువు నష్టం కలిగించేలా వార్తను ప్రచురించినందుకు "సాక్షి" దిన పత్రిక మీద 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు "సాక్షి" కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు.
చంద్రశేఖరరావుకు "సాక్షి" వార్తా కథనాలు కొంతకాలంగా ఇబ్బంది కలిగిస్తున్నాయి. కాంగ్రెస్, టిడిపిలు అగ్రవర్ణాల కను సన్నల్లో నడూస్తున్నాయని ఆయన ఆరో పించారు. తెలంగాణ్ ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరని ఆయన చెప్పారు.
No comments:
Post a Comment