నిరంతర వార్తా స్రవంతి

Thursday, May 1, 2008

తెరాసతో మాట్లాడేది లేదు : తేల్చిచెప్పిన డి.ఎస్.

హైదరాబాదులోని ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం ఏకగ్రీవ ఎన్నిక కోసం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో ఇక మాట్లాడేది లేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక విషయంలో చంద్రశేఖరరావు మాట తప్పారని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కెసిఆర్ తో రాయబారాలు నడిపేది లేదని ఆయన అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 14వ తేదీన పునరంకిత సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించేందుకు ఈ సభను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ, ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, మంత్రులు ఆ సభలో పాల్గొంటారని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల కోసం ఆయన పార్టీ కార్యాలయం గాంధీభవన్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి మొదటి ఫోన్ కరీంనగర్ లోకసభ పార్టీ అభ్యర్థి టి. జీవన్ రెడ్డికి చేశారు.

No comments: