నిరంతర వార్తా స్రవంతి

Tuesday, May 20, 2008

ఎన్నికల కోడ్ పై జాగ్రత్త: వైయస్

ఎన్నికల ప్రవర్తనా నియమావళి పట్ల జాగ్రత్త వహించాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రులకు, కాంగ్రెస్ నాయకులకు సూచించారు. ఏ చిన్న పొరపాటు జరగకుండా ముందే అనుమతులు తీసుకోవాలని ఆయన మంగళవారం సూచించారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదని ఆయన అన్నారు. పాజిటివ్ ఓటును పోలింగ్ బూత్ వరకు తీసుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

అభివృద్ధి తమను గెలిపిస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నాలుగేళ్లలో ఏం జరిగిందో ప్రజలు గమనిస్తున్నారని, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో ప్రజల్లో వ్యతిరేకత చోటు చేసుకోలేదని ఆయన అన్నారు. ఇతర రాజకీయ పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు మీద ఆధారపడతాయని, ఇప్పుడది లేదని ఆయన అన్నారు.

No comments: