నిరంతర వార్తా స్రవంతి

Saturday, May 10, 2008

ఆత్మగౌరవానికి కాంగ్రెస్ ముప్పు : చంద్రబాబు విమర్శ

అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) డైరెక్టర్ పి. వేణుగోపాల్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు.కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రతిసారీ ఇలాగే తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారని ఆయన అన్నారు. మీ కోసం యాత్రలో భాగంగా ఆయన శుక్రవారంనాడు కరీంనగర్ జిల్లాలోని కమలాపూర్ నియోజకవర్గంలో పర్యటించారు.

గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి జరిపిన పాదయాత్రకు, తన యాత్రకు మధ్య తేడా ఉందని ఆయన చెప్పారు. తన యాత్ర దేశ ఆర్థిక పరిస్థితిని మార్చేందుకు సాగుతోందని ఆయన చెప్పారు. కాంగ్రెస్,తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) దొంగాట ఆడుతున్నాయని ఆయన విమర్శించారు. ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. అక్కడి నుంచే ఆయన ఒక ప్రైవేట్ టీవీ చానెల్ జూనియర్ ఎన్టీఆర్ తో నిర్వహించిన లైవ్ షోలో కూడా ఆయన మాట్లాడారు. రైతుల ప్రభుత్వమని చెప్పి కాంగ్రెస్ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని ఆయన విమర్శించారు. తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఇప్పుడు రాష్ట్రంలో ఆదాయం పెరిగిందని ఆయన అన్నారు.

No comments: