నిరంతర వార్తా స్రవంతి

Tuesday, May 20, 2008

చిరంజీవి పాద యాత్ర?

హీరో చిరంజీవి తన పార్టీ విషయంలో అంతులేని మౌనం వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. కొంత మంది అయితే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని, ఆయన మనస్తత్వానికి రాజకీయాలు సరిపడవని వాదిస్తున్నారు.


కానీ చిరంజీవి చుట్టూ ఉండే ఆ నలుగురు, ఆ నలుగురికి సన్నిహితులైన ఆ పదహారు మంది చెబుతున్న విషయం ప్రకారం చిరంజీవి మొదట పాదయాత్రను ఆయన పుట్టిన రోజైన ఆగస్టు 22 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు నుంచి తిరుపతి వరకు సాగిస్తారని అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.


చిరంజీవి తన పాదయాత్రలో భాగంగా ఎటువంటి రాజకీయ ప్రసంగాలు చేయరు. కేవలం ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన యాత్ర సాగిపోతుంది. ప్రజల నుంచి వచ్చే వినతి పత్రాలను మాత్రం ఆయన స్వీకరిస్తారు. ఆయన మౌనపాద యాత్రను టీవీ చానళ్ళు పోటీ పడి ఉచితంగా ప్రసారం చేస్తాయి కాబట్టి ప్రచారం ఖర్చును బాగా తగ్గించుకోవచ్చని చిరంజీవి శిబిరం అంచనా.

తొలి పాద యాత్ర తర్వాత చిరంజీవి పూర్తి స్ధాయిలో జిల్లా పర్యటనలు ప్రారంభిస్తారని తెలుస్తోంది. చిరంజీవి జిల్లా పర్యటనల కోసం రెండు హెలికాప్టర్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. రోడ్ షో నిర్వహించడానికి అత్యాధునిక రెండు చైతన్య రథాలను ముంబైలో తయారు చేయిస్తున్నారు. అవినీతి రహిత సమాజం చిరంజీవి పార్టీకి ప్రధాన ఎజెండా కాబోతోంది.

No comments: