నిరంతర వార్తా స్రవంతి

Thursday, April 3, 2008

హరికృష్ణది వ్యక్తిగత ప్రకటన: పెద్దిరెడ్డి

తాము సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని చేసిన ప్రకటన తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ వ్యక్తిగత అభిప్రాయమని తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ఇ. పెద్దిరెడ్డి అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడే పార్టీ సుప్రీం అని, తెలంగాణపై చంద్రబాబు నిర్ణయం వెల్లడించాల్సి ఉందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉందని, 1971 నుంచి ఈ సెంటిమెంటు ఉందని ఆయన అన్నారు. తెలంగాణ సెంటిమెంటు కొత్తది కాదని ఆయన అన్నారు.

No comments: