నిరంతర వార్తా స్రవంతి

Monday, February 11, 2008

అవినీతిలో ఆంధ్రప్రదేశ్!

(హైదరాబాద్ నుంచి ప్రసాద్)

అవినీతిలో ఆంధ్రప్రదేశ్ పాత్రగురించి ఇటీవల పెద్ద ఎత్తున చర్చసాగుతోంది. యువత మొదలు ముదుసలి వరకూ అందరూ అవినీతి గురించే మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ పాలనలో రాష్ట్రం అవినీతిమయమైందన్న ప్రతిపక్షాల విమర్శలకు ఊతమిచ్చేలా మంత్రుల అవినీతి పెరిగిపోయినట్లు ఇటీవల నిర్వహించిన ఒక సర్వే స్పష్టంచేస్తోంది. ఆర్ధిక మంత్రి రోశయ్య శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లా అవినీతి కూడా అంచనాలు దాటిపోయింది. పాలనా వ్యవస్థలో గత ప్రభుత్వ హయాంలో 23 నుంచి 28 శాతం మధ్య ఉన్న అవినీతి తాజాగా 40 నుంచి 45 శాతానికి పెరగడాన్ని బట్టే అవినీతి తీవ్రతను అంచనా వేయవచ్చు.

No comments: