నిరంతర వార్తా స్రవంతి

Wednesday, February 27, 2008

"ఏ ఎండకాగొడుగు"

"ఏ ఎండకాగొడుగు" అంటే బి.వి.రామారావు పేరు ముందువరసలో ఉంటుంది. చిన్న పరిశ్రమల సమాఖ్య అధ్యక్షునిగా తోటి సభ్యులకు సాధించి పెట్టింది ఏమిటో తెలియదు కానీ ఈయన గారు మాత్రం "స్వర్ణాంధ్ర" పేరిట శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం పారిశ్రామికవాడ సమీపాన జ్యూట్ ఫ్యాక్టరీ పెట్టుకుని బాగుపడ్డాడు. నమ్ముకున్నవాళ్లను అమ్ముకున్నాడనో ఏమో కానీ భగవంతుడు రామారావుపై కన్నెర్రెజేశాడు. ప్రస్తుతం ఆ జ్యూట్ ఫ్యాక్టరీ పీకల్లోతు కష్టాలలో ఉన్నట్టు సమాచారం. చేసిన పాపం ఊరకే పోతుందా మరి! అదునుచూసి పార్టీలు మారడం రామారావుకి వెన్నతో పెట్టిన విద్యగా ఆయనగురించి తెలిసినవాళ్లు చెబుతుంటారు. మొదట్లో తెలుగుదేశాన్ని, తర్వాత కాంగ్రెస్నూ, మధ్యలో బి.జె.పి.నీ కూడా వదలకుండా ఈయనగారు రాజకీయం నడిపారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పుడు మళ్లీ ఫ్యాక్టరీలు, పారిశ్రామికవేత్తలూ గుర్తొచ్చాయి.

No comments: