నిరంతర వార్తా స్రవంతి

Wednesday, February 27, 2008

వీరోచిత పోరాటానికి నిలువెత్తు సాక్ష్యం ’ఉయ్యాలవాడ’

( డా. జోళె పాళం మంగమ్మ)

బ్రిటిష్, ఫ్రెంచ్ తూర్పిండియా వర్తక సంఘాలు అధికారం కోసం పోటీ పడితే వారిలో బ్రిటీష్ వారే నెగ్గారు. దత్త మండలంలో అప్పటికి స్వతంత్రులుగా ఉన్న పాలేగార్లు బ్రిటిష్ అధికారాంకి ఎదురు తిరిగారు. అప్పట్లో, అంటే 1802 నాటికి కడప కలెక్టరయిన థామస్ మన్రో పాలేగార్లతో అయిదేండ్లు పోరాడాడు. వారిలో 80 మందిని పట్టుకుని గుత్తికోటలో బంధించాడు. శిస్తు చెల్లిస్తున్న పాలేగార్లు తమ భూములను ప్రభుత్వపరం చేసినట్టు లెక్కగట్టి వారికి నామమాత్రంగా పింఛను నిర్ణయించాడు. పెద్ద పాలేగార్ల భూములు కొన్ని ఇతర గ్రామాల పరిధిలోనివని ప్రకటిస్తూ ప్రభుత్వం వాటిని వశపరచుకుంది. మేజర్ జనరల్ కంప్ బెల్ నాయకత్వంలొ ప్రతిఘటన లేకుండా బ్రిటిష్ సైనికులు ముఖ్యమయిన కోటలన్నీ ఆక్రమించారు. ముఖ్యంగా గండికోటలో రెండువేల మణువుల మదుగుండు సామగ్రి, 2000 గుండ్లు, పనిచేయని ఫిరంగి ఒకటి సైనికులకు దొరికాయి.
పాళేగారు మరణిస్తే కుటుంబానికి పించ్చను నిలిపివేస్తూ 1845లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారసులు లేరన్న మిషతో ఒక కోయిలకుంట్ల తాలూకాలోనే 60 పాళెములు ప్రభుత్వ పరమయ్యే పరిస్థితి ఏర్పడింది. దళౌసీ ఇదే రజ్య సంక్రమణ సిద్దంతంతో 1857లో సిపాయీల తిరుగుబాటుకు కారణమయ్యాడు.
కడప జిల్లాలో 13 సంవత్సరాల్లో 13 మంది కలెక్టర్లు బదిలీ కావడంతో స్థానిక సమస్యలు ప్రభుత్వానికి అంతు పట్టలేదు. 1845 జూన్ లో ప్రభుత్వం 23 మాన్యాలను వశపరచుకుంది. నిజంగా వారసులు లేనివి అందులో రెండు మాన్యాలు మాత్రమే. నొస్సం, గుండ్ల దుర్తి, కోయిలకుంట్ల ఆ చుట్టు పట్ల కట్టుబడిదార్లు, తిరుగుబాటుకు నాంది పలికారు. నరసిం హారెడ్డి గ్రామాల సంచారం ప్రారంభించాడు. కోయిలకుంట్ల తాలూకాలోని ఉయ్యాలవాడ, నొస్సంతో సహా 19 గ్రామాలు నరసిం హారెడ్డితో కలిశాయి. 1845 జులై 10వ తేదీ నరసిం హారెడ్డి కోయిలకుంట్ల తాలూకా కచేరికి రాగానే ప్రభుత్వ సిబ్బంది ఆయనతో కలిశారు.
ఉయ్యాలవాడ, నొస్సం పాలేగార్ల భూములు ప్రభుత్వ పరమయి, వారి కుటుంబాలకు కొద్దిపాటి పించ్చను లభించింది. ఉయ్యాలవాడ పాలేగారు ముగ్గురి కుమారుల్లో ఆఖరివాడు నరసిం హారెడ్డి. తల్లి వైపు నొస్సం పాలేగారు కుటుంబానికి 1821 వరకు పించ్చను లభించింది. నరసిం హారెడ్డికి ప్రభుత్వం నుండి వచ్చే పించ్చను చాలలేదు. కోయిలకుంట్ల తాలూకా ఆకుమళ్ళ గ్రామస్థుడు గోసాయి వెంకయ్య నరసిం హారెడ్డికి అతి సన్నిహితుడు. తన అసంతృప్తిని గోసాయికి వెళ్ళబోసుకున్నాడు రెడ్డి. తనకు, తన వారికీ అన్న్యాయం జరిగిందనీ, ముందు ముందు మంచి రోజులున్నాయనీ గోసాయి చెప్పడం రెడ్డిన్ మరింత బలపరచింది.
జయం తందేననే ధీమాతో ఉన్న నరసిం హారెడ్డిని తహసిల్దారు ట్రెజరీకి వచ్చి పించ్చను తీసుకోమని కబురంపటం తన హోదాకు భంగకరమనిపించింది రెడ్డికి. ప్రభుత్వ సేవకు హాజరయ్యేవారంతా, ఈటెగాళ్ళతో సహా నారాసిం హారెడ్డితో చేరారు. ఔకు జమీందార్లు, బనగానపల్లి నవాబు బంధువులు- ప్రభుత్వంతో అసంతృప్తి చెందినవారంతా నరసిం హారెడ్డిని బలపరిచారు. బ్రిటిష్ వారిని అధికారం నుంచి తొలగించాలనే భావం ప్రబలింది. బ్రిటిష వారితో పోరాడి విజయమో, వీర స్వర్గమో పొందాలని నరసిం హారెడ్డి నిర్ణయించాడు.
నరసిం హారెడ్డి వాదనతో ఏకీభవించిన వందలాదిమంది కట్టుబడిదార్లు అతనితో కలిశారు. పాలూరు, వనపర్తి, ఔక్, ఆనగొంది ఇంకా అనేక ఇతర పాలేగార్లు ఆయంతో చేతులు కలిపారు. గోల్కొండ నవాబు పనంపిన సనద్ మీద పారశీక భషలో రాజముద్ర ఉండేది. ఎల్లప్పుడూ దానిని వెంట ఉంచుకుని నైజాము రాజ్యంలోని కొందరు నవాబులతో కూడా నరసిం హారెడ్డి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు.
జులై 10వ తేదీన కోయిలకుంట్ల తాలూకా ఖజానాను రెడ్డి కొల్ల గొట్టాడు. ఖజానాను కాపాడేందుకు ప్రయత్నిస్తూ దఫేదారు, కొందరు ప్యూన్లు భవనం మీదనుంచి కాల్పులు జరిపారు. తమ మనుష్యులను కొందరిని పోగొట్టుకున్న నరసింహారెడ్డి ఒక గుండుతో డఫేదారుని కాల్చి చంపాడు. మరో అయిదుగురు పోలీసులు కూడా అక్కడికక్కడే మరణించారు. అక్కడి అమల్దారులు రెడ్డి ఎత్తుకుపోయాడు. ఇతర ప్రభుత్వ సేవకుల ఇండ్ల మీద నిఘా ఏర్పాటు చేశాడు. ఖజానాలో ఏమంత పెద్ద మొత్తం లేదు. శిస్తు వశుళ్ళన్నీ రూ. 650-14-2; ఇతర మార్గాల్లో ఆదాయం రూ. 136-9-4; ఖర్చు చూపినా చెల్లించని మొత్తం 18-2-10.
కడప జిల్లాలో 13 సంవత్సరాల్లో 13 మంది కలెక్టర్లు బదిలీ కావడంతో స్థానిక సమస్యలు ప్రభుత్వానికి అంతు పట్టలేదు. 1845 జూన్ లో ప్రభుత్వం 23 మాన్యాలను వశపరచుకుంది. నిజంగా వారసులు లేనివి అందులో రెండు మాన్యాలు మాత్రమే. నొస్సం, గుండ్ల దుర్తి, కోయిలకుంట్ల ఆ చుట్టు పట్ల కట్టుబడిదార్లు, తిరుగుబాటుకు నాంది పలికారు. నరసిం హారెడ్డి గ్రామాల సంచారం ప్రారంభించాడు. కోయిలకుంట్ల తాలూకాలోని ఉయ్యాలవాడ, నొస్సంతో సహా 19 గ్రామాలు నరసిం హారెడ్డితో కలిశాయి. 1845 జులై 10వ తేదీ నరసిం హారెడ్డి కోయిలకుంట్ల తాలూకా కచేరికి రాగానే ప్రభుత్వ సిబ్బంది ఆయనతో కలిశారు.
ఉయ్యాలవాడ, నొస్సం పాలేగార్ల భూములు ప్రభుత్వ పరమయి, వారి కుటుంబాలకు కొద్దిపాటి పించ్చను లభించింది. ఉయ్యాలవాడ పాలేగారు ముగ్గురి కుమారుల్లో ఆఖరివాడు నరసిం హారెడ్డి. తల్లి వైపు నొస్సం పాలేగారు కుటుంబానికి 1821 వరకు పించ్చను లభించింది. నరసిం హారెడ్డికి ప్రభుత్వం నుండి వచ్చే పించ్చను చాలలేదు. కోయిలకుంట్ల తాలూకా ఆకుమళ్ళ గ్రామస్థుడు గోసాయి వెంకయ్య నరసిం హారెడ్డికి అతి సన్నిహితుడు. తన అసంతృప్తిని గోసాయికి వెళ్ళబోసుకున్నాడు రెడ్డి. తనకు, తన వారికీ అన్న్యాయం జరిగిందనీ, ముందు ముందు మంచి రోజులున్నాయనీ గోసాయి చెప్పడం రెడ్డిన్ మరింత బలపరచింది.
జయం తందేననే ధీమాతో ఉన్న నరసిం హారెడ్డిని తహసిల్దారు ట్రెజరీకి వచ్చి పించ్చను తీసుకోమని కబురంపటం తన హోదాకు భంగకరమనిపించింది రెడ్డికి. ప్రభుత్వ సేవకు హాజరయ్యేవారంతా, ఈటెగాళ్ళతో సహా నారాసింహారెడ్డితో చేరారు. ఔకు జమీందార్లు, బనగానపల్లి నవాబు బంధువులు- ప్రభుత్వంతో అసంతృప్తి చెందినవారంతా నరసిం హారెడ్డిని బలపరిచారు. బ్రిటిష్ వారిని అధికారం నుంచి తొలగించాలనే భావం ప్రబలింది. బ్రిటిష వారితో పోరాడి విజయమో, వీర స్వర్గమో పొందాలని నరసిం హారెడ్డి నిర్ణయించాడు.
నరసిం హారెడ్డి వాదనతో ఏకీభవించిన వందలాదిమంది కట్టుబడిదార్లు అతనితో కలిశారు. పాలూరు, వనపర్తి, ఔక్, ఆనగొంది ఇంకా అనేక ఇతర పాలేగార్లు ఆయంతో చేతులు కలిపారు. గోల్కొండ నవాబు పనంపిన సనద్ మీద పారశీక భషలో రాజముద్ర ఉండేది. ఎల్లప్పుడూ దానిని వెంట ఉంచుకుని నైజాము రాజ్యంలోని కొందరు నవాబులతో కూడా నరసిం హారెడ్డి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు.
జులై 10వ తేదీన కోయిలకుంట్ల తాలూకా ఖజానాను రెడ్డి కొల్ల గొట్టాడు. ఖజానాను కాపాడేందుకు ప్రయత్నిస్తూ దఫేదారు, కొందరు ప్యూన్లు భవనం మీదనుంచి కాల్పులు జరిపారు. తమ మనుష్యులను కొందరిని పోగొట్టుకున్న నరసిం హారెడ్డి ఒక గుండుతో డఫేదారుని కాల్చి చంపాడు. మరో అయిదుగురు పోలీసులు కూడా అక్కడికక్కడే మరణించారు. అక్కడి అమల్దారులు రెడ్డి ఎత్తుకుపోయాడు. ఇతర ప్రభుత్వ సేవకుల ఇండ్ల మీద నిఘా ఏర్పాటు చేశాడు. ఖజానాలో ఏమంత పెద్ద మొత్తం లేదు. శిస్తు వశుళ్ళన్నీ రూ. 650-14-2; ఇతర మార్గాల్లో ఆదాయం రూ. 136-9-4; ఖర్చు చూపినా చెల్లించని మొత్తం 18-2-10.
నరసిం హారెడ్డి కార్యకలాపాలను అడ్డుకునేందుకు కడప, కర్నూలు, బళ్ళారి, సికిందరాబాదు నుండి సైనిక బృదాలు బయలు దేరాయి. కడప, కర్నూలు సరిహద్దు కొండల్లోని గుత్తి మీదుగా సప్లయిలు సమకూర్చుకుంటూ నరసిం హారెడ్డి గిద్దలూరుకు బయలుదేరాడు. అతని సైన్యంలో వడ్డరులు, యానాదులు అంతా మూడు వేలమంది ఉన్నారు. 19వ రెజిమెంట్లోని కెప్టెన్ స్కాట్ నాయకత్వంలో 250 మంది సైనికులు, 50 మంది సవారులు, కర్నూలు అసిస్టెంట్ కమిషనరు కెప్టెన్ రసల్తో బాటు నదికనుమ దాటారు. నరసిం హారెడ్డి ఈ కఒండలను నంది కనుమకు దక్షిణంగా అప్పటికే దాటాడు. కంభం నుండి వచ్చిన దళంతో బ్రిటీష్ దళం కలవవలసి ఉంది. సైనికులు గుత్తికనుమను కాపలా కాస్తున్నారు. దక్ష్నిణంగా మరో కనమకు కలెక్టరు కొక్రెయిన్, సైనికులు కాపలా కాస్తున్నారు. దాడి జరిపేందుకు నరసిం హారెడ్డి సన్నాహాలు చేస్తున్నాట్టు కర్నూలు అశ్వదళం సమాచారం అందించింది.
బ్రిటిష్ సైనయం సమీపిన్నట్టు తెలిసిన రెడ్డి బృనదం జమ్మలమడుగుకు ఇరవై మైళ్ళలో కర్ణులు సరిహద్దులోని రుద్రవం చేరుకున్నారు. సైన్యం సమీపించగానే కడపజిల్ల కంభం వైపు ఉన్న కొండల్లోకి వెళ్ళిపోయారు. ప్రభుత్వ దళంతో తలపడాలన్నదే రెడ్డి ఉద్దేశ్యం. కెప్టెన్ నాట్ తో వచ్చిన సైనయం కంభం నుండి వచ్చిన సైన్యంతో కలవాల్సి ఉన్నందున వారు నంది కనుమ దాటారు. తిరుగుబాటు దార్లను అడ్డుకొట్టి వారు తిరిగీ కనుమలు దాటకుండా చేయాలన్న ఉద్దేశ్యంతో కలెక్టర్ కొక్రెయిన్ నాయకత్వంతో అదే రెజిమెంట్లోని కెప్టెన్ కోత్స్ సైన్యంతో ఆయన వెంట ఉన్నాడు. దట్ట్మయిన అటవీ ప్రాంతమయినా నరసిం హారెడ్డిని చుట్టుముట్టి పట్టుకోవాలన్నదే ప్రభుత్వ వ్యూహం.
అప్పటికే నరసిం హారెడ్డి బలగం 5 వేలమంది ఉన్నారు. లెఫ్టినెంట్ వాట్సన్, తహసిల్దారుతో సహా వందమంది పూన్లతో గిద్దలూరు సమీపంలో ఉన్నాడు. నరసిం హారెడ్డి జులై 23 వ తేదీన వాట్సన్ మీద దాడి చేసాడు. వాట్సన్ కు ఎదురు చూస్తున్న సహాయం అందలేదు. నిస్సహాయుడుగా వాట్సన్ పాడుపడిన ఒక్ కోట చేరుకున్నాడు. ఆరుగంటల సేపు హోరాహోరీ పోరాటం జరిగింది. చీకటి పడగానే వాట్సqన్ రెడ్డి మీద మెరుపుదాడి చేశాడు. సాహసంగా ముందుకు దూకి, దాదాపు రెండువందల మందిని చంపి పాలేగారును వెనకకు తరిమాడు. నలుగురు సిపాయిలు మరణించారు. ముగ్గురు గాయపడ్డారు. అయిదు మైళ్ళలోని ముండ్లపాడుకు రెడ్డి ఉపసమ్హరించుకున్నాడు. వాట్సన్ కూడా ఆ చీకటిలోనే సమీపంలోని సెట్టి వీడుకు పారిపోయాడు. పోరాటంలో గిద్దలూరు తహసిల్దారే చనిపోయినందున పాడుపడిన కోటలోని తమ యుద్దసామగ్రిని కూడా వట్సన్ సేకరించుకోలేదు.
ఈ విషయం తెలిసిన కెప్టెన్ నాట్ గాజులపల్లిలో తన 19వ రెజిమెంట్తో రాత్రి గడిపి, కృష్ణం సెట్టి పల్లి మీదుగా గిద్దలూరుకు బయలుదేరాడు। లెఫ్టినెంట్ రసల్ నాయకత్వంలో కర్నూలు అశ్విక దళం కూడా కృష్ణం సెట్టి కోట చేరారు। గ్రామం నిర్మానుష్యంగా ఉంది। తిరుగుబాటు దారులు ఎవరయినా దాగి ఉన్నారేమోనని ఇళ్ళన్నీ గాలించారు। ప్రభుత్వ దళాలు నరసిం హారెడ్డిని చుట్టుముట్టినా రెడ్డి హైదరాబాదు ప్రాంతానికి తరలివెళ్ళి మరలా దళాన్ని సమకూర్చుకున్నాడు।కొండలు దిగి మైదానం మీద దాడి జరుపుతాడనే భీతితో సేనలను కొండల కిరువైపులా ప్రభుత్వం కాపలా పెట్టింది. రిజర్వు దళం కంభంవైపు గుత్తి కనుమ పాదంలో రెడ్డి ప్రధాన కార్యాలయమున్న కొత్తకోట చేరుకునే ప్రయత్నం చేసింది. నది పొంగటంతో ప్రవాహాన్ని దాటలేకపోయారు. నరసిం హారెడ్డి ఎర్రమలై కొండల్లోకి వెళ్ళిపోయాడు. ప్రభుత్వ సిబ్బందికి రెడ్డి సంచారం అంతు బట్ట్క, పట్టి ఇచ్చిన వారికి వెయ్యి రూపాయలు బహుమతి ప్రకటించారు. తన కట్టుబడి ప్యూన్లు వందమంది తిండికి రోజుకు ఎన్మిది రూపాయలు అలవెన్సు ఇచ్చినట్టయితే నరసిం హారెడ్డిని పట్టి ఇవ్వడానికి పాలేగారు ఎర్ర చెన్నమనాయుడు సిద్దంగా ఉన్నాడని బళ్ళారి మేజిస్ట్రేటు కడప మేజిస్ట్రేటుకు తెలియ చేశాడు. నరసిం హారెడ్డి భార్య , పిల్లలు కొత్తకోటలో ఉన్నారు. కొత్తకోట చేరిన నరసిం హారెడ్డిని ప్రభుత్వం కనిపెట్టలేక పోయింది.
కొత్తకోటలో నరసిం హారెడ్డి ప్రధాన కార్యాలయం మీద దాడి చేసినప్పుడు ప్రభుత్వానికి కొన్ని ముఖ్యమయిన పత్రాలు దొరికాయి. హైదరాబాదు రజ్యంలో ప్రాతుకూరు జమీందారయిన లాల్ ఖానుకు పాలేగారు వ్రాసిన లేఖకు సమాధానంగా తాను సహాయం చేస్తానని జమీందారు మాట ఇచ్చాడు. ఈ లాల్ ఖానును బందించవలసిందిగా హైదరాబాదులోని బ్రిటిష్ రెసిడెంటుకు ప్రభుత్వం రాసింది. పాలేగారు తిరుగుబాటు జరిపినందుకు అభినందించే అనేక ఉత్తరాలున్నాయి. కోయిల కుంట్ల తాలూకావారు, గ్రామాల పెద్దలు కొందరు తాము బలగాన్ని పంపుతున్నట్టు వ్రాసిన అనేక ఉత్తరాలున్నాయి. రెడ్డి తన అనుచరులకు చెల్లించిన పైకము లెక్కలున్నాయి. అనుచర్ల పేర్లు కూడా ఆ జాబితాల్లో ఉనాయి. హైదరాబాదు రాజ్యం సరిహద్దుల్లో కృష్ణానది ఏ రేవులో దాటినా అటకాయించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.
లెఫ్టినెంట్ రసెల్ అశ్వదళంతో 36వ రెజిమెంట్తో సికిందరాబాదునుండి బయలుదేరాడు. దారిలో సప్లయిలు అందటం ఇబ్బందయింది. 5 వ రెజిమెంటు, 19వ రెజిమెంటు కోయిల కుంట్లలో ప్రధాన కార్యాలయం ఏర్పరచుకున్నారు.1846 అక్టోబరు 6వ తేదీకి నరసిం హారెడ్డి పేరుసోమల కొండ మీద ఉన్నట్టు ప్రభుత్వానికి తెలిసింది. నరసిం హారెడ్డి కొత్తకోట వదలి, ఎర్రమలై వదలి నల్లమలైకు బయలౌదేరాడు. ఆరుమైళ్ళు విస్తరించిన పేరుసోమల కొండమీద దేవాలయాన్ని స్థావరం చేసుకున్నాడు. పేరుసోమల గ్రామంలో కర్నూలు ఇర్ రెగ్యులర్ అశ్వదళం ఉంది. 19వ రెజిమెంట్ పేరుసోమల చేరింది. యాభైమంది సవారులు కొండ్ను చుట్టుముట్టారు. ఈ దాడిలో 40 మంది దాకా మరణించారు. 90 మంది పట్టుబడ్డారు. అనేకులు గాయపడ్డారు. కలిలో గుండు దూసుకుపోయిన నరసిం హారెడ్డి పట్టుబడ్డాడు. 16 సంవత్సరాల కుమారుడు మల్లారెడ్డి తండ్రి వెంట ఉన్నాడు. మల్లరెడ్డిని కలెక్టరు కొక్రెయినుకు అప్పగించాడు. రెడ్డి అనుయాయులంటూ గ్రామస్థులలో కొందరిని పట్టుకున్నారు.కొత్తకోటలో అభించిన కాయితాల్లో ఉన్న జబితాలోని వారందరికీ వారంట్లు జారీ అయ్యాయి. వారిలో ముఖ్యులు గోసాయి వెంకయ్య, కరణం అశ్వర్థం, దాసరి రోసిరెడ్డి, జంగం మల్లయ్య. పోరాటంలో 5 వందల మందిదాకా కట్టుబడులకు వంశపారంపర్యంగా వచ్చే ఆదాయం నిలుపు చేశారు. మొత్తం 901 మంది పట్టుబడితే 412 మందిని షరతులేవీ లేకుండా విడుదల చేశారు. 273 మందిని కొంత జామీను మీద వదిలారు. 232 మందిని విచారణకు హాజరు పరచారు. గోసాయి వెంకయ్యను కడప జిల్లా పోలీసుదళంలోని జాఫర్ మహమ్మద్ హైదరాబాదు రాజ్యంలోని ముక్త్యాల డివిజన్లో ఆత్కూర్ వద్ద పట్టుకున్నాడు.
నరసిం హారెడ్డి తిరుగుబాటు చేశాడనీ, హత్యలు చేశాడనీ, దోపిడీలు చేశాడనీ కడప స్పెషల్ కమిషనర్ 1834 రెగ్యులేషన్ 1 సెక్షన్ 2 క్రింద, 1802 రెగ్యులేషన్ 8 సెక్షన్ 10 క్రింద నేరం మోపారు. తీర్పుతోపాటు వారెంట్ పంపారు. జిల్లా అధికార్లు ఈ వారంటు అందిన తరువాత కోయిలకుంట్ల సమీపంలో ఎన్న్నిక చేసిన చోట వీలయినంత త్వరలో నరసిం హారెడ్డిని ఉరితీయాలని, పెద్ద మంచెకు శరీరాన్ని గొలుసులతో వేలాడతీయాలనీ ఆదేశించారు.
1847 ఫిబ్రవరి 22వ తేదీ సోమవారం ఉదయం 7 గంటలకు నరసిం హరెడ్డిని ఉరితీస్తారని విస్తారంగా ప్రచారం చేశారు. భయంకరమయిన ఈ శిక్షను అంలు జరిపేటప్పుడు అక్కడ గుమికూదిన రెండువేలమంది ఎంతో నిశ్శబ్దంగా ఉన్నారు. నరసిం హారెడ్డి ధైర్యంగా, ప్రశాంతంగా ఉన్నాడు. కడపనుండి కోయిలకుంట్ల చేరేవరకూ కూడా నిగ్రహం చూపాడు. ఉరికంబం మీద ప్రశాంతంగా ఉన్నాడు. ఉరి తీసిన తర్వాత అదే వేదిక మీద శిరస్సు 1877 వరకు అంటే 30 సంవత్సరాలు వేలాడింది. వేదిక పడిపోతోందని, దాని మరమ్మతు చేపట్టాలా?వద్దా? అని అధికార్లు అడిగినప్పుడు, అలాగే సహజంగా వదలివేయండని ఆదేశాలు అందాయి. బ్రిటీష్ రాజ్యంలో 1947కు ముందు దేశ వ్యాప్తంగా ఇలాంటి ఎన్ని వేదికలు ఆ నూరేండ్ల కాలంలో నేలకూలాయో మనం చెప్పలేము.
1846 డిసెంబరు 8 వ తేదీ స్పెషల్ కమిషనర్ కోర్టులో కేసులను పరిశీలించాడు. ముండ్లపాడు వద్ద జులై 24వ తేదీ బాహాటంగా సాయుధ తిరుగుబాటు జరిపారని 35 మంది మీద నేరం మోపారు. తమను ఇండ్లనుండీ, పొలాలనుండి బలవంతాన లాక్కొచ్చారని చాలమంది చెప్పుకున్నారు. విచారణ మీద వారిలో 30 మందికి తిరుగుబాటుతో ఏమీ సంభందం లేదని తేలి, వింటనే విడుదల చేశారు. క్షమాభిక్ష పెట్టవచ్చని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్లు అభిప్రాయపడ్డారు. శిక్షపడిన వారిలో 14 సంవత్సరాల శిక్షను 8 సంవత్సరాలకు, 8 సంవత్సరాలను 6కు, 7 సంవత్సరాలను 5 ఏండ్లకు, 5 సంవత్సరాలను 3 ఏండ్లకు తగ్గించారు. స్వాతంత్య సమరయోధుని భయంకరంగా ఉరితీసి, తాము ఎంతో కారుణ్యం గలవారమని ప్రజలకు చాటేందుకు ఈ విధంగా శిక్షలు తగ్గించారన్నది విదితమే. 1801లో దత్తమండలం బ్రిటిష్ వారి వశమయినప్పుడు ప్రారంభమయిన పాలేగార్ల పోరాటం మీద 1847లో నరసిం హారెడ్డిని ఉరితీయడంతో తెరపడింది. దక్షిణాది పాలేగార్ల తిరుగుబాటు ముగిసిన పదేండ్లకే 1857లో జయీయ స్వాతంత్య పోరాటానికి నాంది పలికింది.రాయలసీమ కొండ ప్రాంతాల్లో ఈ నాటికీ పాడుపడిన మట్టి కోటలు దర్శనమిస్తాయి. ఒకనాటి వీరుల గాథలను మనకు గుర్తుచేస్తాయి. వాటిని మరమ్మత్తు చేయరాదని కంపెనీ డైరెక్టర్లు ఉత్తర్వు జారీ చేశారు. పాలేగార్లది స్వాతంత్ర్య పోరాటమే కాదనీ, గ్రామాలు దోపిడీ చేసేవారనీ చరిత్రకారులు కొట్టి పారేశారు. ఇటీవల మాత్రమే చారిత్రక పరిశోధకులు ఈ అంశాన్ని పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. 1845లో వారసులు లేని భూములను ప్రభుత్వం వశపరచుకోవడమన్నదే మరో పదేండ్లకు రాజ్య సంక్రమణ సిద్దాంతం గా అమలులోకి వచ్చింది. ఝాన్సీ రాణీ,నానాఫడ్నవీస్, తాంతియాతోపే ఇంకా ఇతరులు 1857 తిరుగుబాటులో చేరడానికి ఇదే ప్రధాన కరణమని గుర్తించి ఈ అంశం మీద చరిత్రకారులు, పరిశోధకులు ఇంకా లోతుగా పరిశోదించాలి.
(ఆకాశవాణి కడప కేంద్రం వారి, సౌజన్యంతో, 1996)

No comments: