నిరంతర వార్తా స్రవంతి

Saturday, February 16, 2008

పాత్రికేయుల ప్రాంతీయ పోరు!

(విశాఖపట్నం నుంచి ఎస్పీ)

ప్రత్యేక తెలంగాణ వాదన ఊపందుకున్న తర్వాత రాష్ట్రంలోని పాత్రికేయుల మధ్య వచ్చిన వేర్పాటువాదం ఇప్పుడు ఉత్తరాంధ్రకూ పాకింది. హైదరాబాదులాగే ఇక్కడి పాత్రికేయుల మధ్యా ప్రాంతీయ పోరు మొదలైంది. వివిధ పక్షాల మధ్య రాజుకుంటున్న ప్రాంతీయ పోరుకు మీడియా కూడా అతీతం కాదని నిరూపిస్తూ విశాఖ నగరానికి చెందిన కొంతమంది విలేఖరులు "ఉత్తరాంధ్ర అభివృద్ధి" పేరిట శనివారం సమావేశమై ప్రాంతీయ పోరుపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ పో(ఆ)రాటం వెనుకున్న ఆంతర్యం ఏమిటోగానీ ఇప్పుడు అందరిలోనూ ఒకటే చర్చకు దారితీసింది.

No comments: