నిరంతర వార్తా స్రవంతి

Sunday, February 17, 2008

ప్రజాస్వామ్య పునాది సింగపూర్

సింగపూర్ (మలయ్: Singapura; చైనీస్: 新加坡, Xīnjiāpō; తమిళం: சிங்கப்பூர்), అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ ఒక చిన్న ద్వీపం, దేశం, నగరం కూడాను. మలేషియాకు దక్షిణాన కలదు. 704 చదరపు కిలోమీటర్ల తో (272 చదరపు మైళ్ళు) దక్షిణ ఆసియాలోని అతి చిన్న దేశం.
బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ 1819వ సంవత్సరములో అడుగుపెట్టినప్పుడు ఇది మలయ్, ఒరాంగ్ లౌట్ జాలర్లు నివసించు గ్రామం. బ్రిటిషు వారు రవాణాల నిమిత్తం వాడుకున్నారు. రెండవ ప్రపంచయుద్ధం సమయంలో జపాను ఆక్రమించింది, 1945 సంవత్సరములో తిరిగి బ్రిటిష్ వారి పరమయ్యింది. 1963 సంవత్సరములో మలేషియా ఏర్పడినప్పుడు దానిలో భాగంగా ఉండి, రెండు సంవత్సరముల తరువాత సైద్ధాంతిక భేదాలతో విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడినది.
స్వతంత్ర దేశంగా అవతరించిన తరువాత, సగటు సింగపూర్ నివాసి జీవనశైలి గణనీయంగా పెరిగింది. విదేశీ పెట్టుబడులు ప్రభుత్వ యంత్రీకరణము వలన ఎలక్ట్రానిక్సు మరియు కర్మాగారం ఆధారంగా ఒక ఆధునిక ఆర్ధికరంగం ఉద్భవించింది. స్థూల జాతీయ ఉత్పత్తి ఆధారంగా ప్రపంచంలో 18వ ధనవంతమైన దేశము. భూభాగము ప్రకారము ఎంతో చిన్నదయినా, సి.$212 బిలియన్ల మారకద్రవ్య (అ.$139 బిలియన్లు) నిలవలు కలది. ధనవంతమైన జీవన శైలి ప్రకారము, ది ఎకనామిస్టు (2005) సింగపూరును ఆసియాలో అతి ఉత్తమమైనదిగా ప్రపంచములో 11వ స్థానముగా నిర్ధారించినది. ఇంత చక్కటి విలువలు కలిగి ఉన్నా, సగటున లక్ష జనాభాకు 13.57 మరణశిక్షలు నమోదు అవుతున్నాయి, సౌదీ అరేబియా 4.65 మరియు చైనా 2.01 శాతం గమనించాల్సిన విషయం.

No comments: