నిరంతర వార్తా స్రవంతి

Monday, February 25, 2008

జూ. ఎన్.టి.ఆర్. కొత్త చిత్రం

వి వి వినాయక్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది. ఇది అందరూ అనుకుంటున్నట్లుగా యుగంధర్ రీమేక్ కాదట. వినాయక్ దర్శకత్వం వహించిన ఎన్టీఆర్ సినిమా "ఆది" బాక్సాఫీసు వద్ద పెద్దగా హిట్టయిన విషయం తెలిసిందే. మళ్లీ వీరిద్దరూ కలిసి పని చేస్తున్నారు. ఎన్టీఆర్ తో "సాంబ" సినిమాను నిర్మించిన కొడాలి నానీ ఈ సినిమా నిర్మాత. ఈ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 28వ తేదీన ప్రారంభమవుతుందని తెలిసింది. వినాయక్ ఎన్టీఆర్ ను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్టు రాస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది చివరలో విడుదల చేయాలని కొడాలి నాని భావిస్తున్నారు.

No comments: