
ఉగాది వస్తుంది అనగానే సాహితీకృషీవలురు పలువురు ముద్రణారంగాన్ని ముఖ్యంగా పత్రికాప్రపంచాన్ని సుసంపన్నం చేస్తారు. కధలు, కవితలు, వ్యాసాలు, నవలలు, అనువాదాలు, విమర్శలు, పద్యాల తోరణాలతో పండగరోజు తెలుగుభాషామతల్లిని శోభాయమానంగా అలంకరిస్తారు. పత్రికారంగం కూడా అన్నిసాహితీప్రక్రియల్లో పోటీలు నిర్వహించి, కొన్ని వందలరూపాయల నుంచి, అక్షరాలా లక్షరూపాయలవరకూ నగదు పురస్కారాలను విజేతలకు అందజేస్తుంది. అచ్చుపత్రికలు, పోర్టల్సు, వెబ్ పత్రికలు రానున్న ఉగాదికి అన్ని సాహితీవిభాగాల్లోనూ పోటీలు ఇప్పటికే ప్రకటించాయి. గోరంత విత్తు కొండంత చెట్టయినట్లు సరదాగా మొదలయిన తెలుగు బ్లాగులు క్రమంగా సమాంతర సమాచార, సాహితీవేదికలుగా రూపాంతరం చెందిన విషయం సభ్యసమాజం సగౌరవంగా గుర్తించి, బ్లాగరుల వైపు ఆసక్తిగా, ఆశగా చూస్తుంది.. ఈ ఉగాది రచనల పోటీల్లో విజేతలుగా నిలిచే అర్హత మన బ్లాగర్లలో చాలా మందికి ఉంది. ఆలస్యం అమృతం విషం అన్నట్లు మన వారు కలాలు తీసుకుని కార్యరంగంలోకి దుమకటమే ఆలస్యం.
No comments:
Post a Comment