నిరంతర వార్తా స్రవంతి

Saturday, March 1, 2008

వచ్చే ఐదేళ్లలో 20వేల ఉద్యోగాలుః భెల్ వెల్లడి

వచ్చే ఐదేళ్లలో తాము 20వేల మందికి కొత్తగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ తెలిపింది. భారీగా విస్తరణ కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టు కొత్త ఉద్యోగ నియామకాలు ఉండగలవని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ కె పురి తెలిపారు.రూ. 6,500 కోట్లతో 2012 నాటికి ఉత్పత్తి సామ ర్థ్యాన్ని 20,000 మెగావాట్లకు పెంచనున్నామన్నారు. ప్రస్తుతం కంపెనీలో 42,600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంజనీరింగ్ (మెకానికల్, ఎలక్ట్రికల్), ఇతర టెక్నికల్ ఉద్యోగాలతో పాటు అన్ని కేటగిరీ ఉద్యోగాల నియామకం చేపడతామని ఆయన పేర్కొన్నారు.ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ మొదటిదశ విస్తరణ కార్యక్రమం పూర్తయి. ఉత్పత్తి సామర్థ్యం 10వేల మెగావాట్లకు చేరుకోనుందని తెలిపారు. అలాగే రెండో దశ తర్వాత 15వేల మెగావాట్లకు చేరుకోనుందని వెల్లడించారు. విద్యుత్‌కు డిమాండ్ పెరుగుతున్నందునే విస్తరణ కార్యకలాపాలను చేపడుతున్నామని తెలిపారు.

No comments: