నిరంతర వార్తా స్రవంతి

Saturday, March 22, 2008

అధికారంలో ఉన్నంత కాలం ఉచిత విద్యుత్

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం రైతులకు ఉచిత విద్యుత్ పథకం అమలు జరిపితీరుతామని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి స్పష్టంచేశారు. "ఎన్ని వ్యయప్రయాసలకు ఓర్చైనా రైతులకు ఉచిత విద్యుత్ అందించి తోరుతాం" అని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా శనివారం ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలతో కాసేపు సమావేశం అయిన వైఎస్ మీడియాతోనూ ముచ్చటించారు. ఈ సందర్భంగా ఉచిత విద్యుత్ గురించి విలేఖరులు ప్రశ్నించినప్పుడు వైఎస్ పై విధంగా స్పందించారు. పేదలకు ఉచితంగా వైద్య సేవలందించే "ఆరోగ్యశ్రీ" పథకాన్ని త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే కార్యక్రమాలను భవిష్యత్తులో మరిన్ని చేపట్టనున్నామని, చేపట్టిన74 ప్రాజెక్టుల్లో 14 పూర్తిచేసినట్లు చెప్పారు.

No comments: