నిరంతర వార్తా స్రవంతి

Thursday, March 6, 2008

అంతిమపోరుకు మాదిగలు సిద్ధం

ఎస్సీల వర్గీకరణ కోసం మాదిగలంతా అంతిమపోరాటానికి సిద్ధంగా ఉన్నారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేత మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయరాం మాదిగ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు నెల్లూరు వెళ్లిన కృష్ణ మాదిగ విలేఖరులతో ముచ్చటించారు. ఎస్సీల వర్గీకరణపై కేంద్రం ఏర్పాటుచేసిన ఉషామెహ్రా కమిషన్ నివేదికను ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ప్రవేశపెట్టి ఆమోదించడంపై ఈనెల 25లోపు నిర్ణయం తీసుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎస్సీలను వర్గీకరిస్తే తమ పదవులకు రాజీనామాలు చేస్తామంటూ కొంతమంది ఎమ్మెల్యేలు బెదిరిస్తుండడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.

No comments: