నిరంతర వార్తా స్రవంతి

Wednesday, March 5, 2008

ఇందిరమ్మ ఇళ్లపై అలసత్వం వద్దు: శ్రీకాంత్

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి అమలుచేస్తున్న ఇందిరమ్మ కార్యక్రమంపై సంబంధిత అధికారులు ఎలాంటి అలసత్వాన్ని ప్రదర్శించినా సహించేదిలేదని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నాగులాపల్లి శ్రీకాంత్ పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా అధికారులు పనిచేసి మంచి ఫలితాలు సాధించేందుకు కృషిచేయాల్సి ఉందన్నారు. గత రెండు విడతల మాదిరిగానే మూడో విడత ఇందిరమ్మ కార్యక్రమాన్ని కూడా సమర్ధమంతంగా అమలుచేయాలని సూచించారు. ౩వ విడత ఇందిరమ్మ కార్యక్రమంపై ఎంపిక కమిటీ సభ్యులకు అవగాహన కలిగించేందుకు ఏర్పాటుచేసిన సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ ఈ విడత ప్రాధాన్యతలను వివరించారు.

No comments: