నిరంతర వార్తా స్రవంతి

Saturday, March 1, 2008

మెగా అభిమానులపై నిఘా!

చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ లపై నిఘా పెట్టిన రాష్ట్ర పోలీసులు చిరు అభిమానుల మీద కూడా మానసికంగా వత్తిడి తెస్తున్నారు। రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయేషా అత్యాచారం, హత్య కేసులో అలసత్వం చూపిస్తున్న పోలీసులు చిరంజీవి అభిమానులను మాత్రం విడిచి పెట్టడం లేదు.విజయవాడకు సమీపంలోని ఇబ్రహీంపట్నంలో చిరంజీవి అభిమానులందరి మీద నిఘా పెట్టి, ఆయేషా హత్య కేసులో ఇంటరాగేషన్ చేస్తున్నట్టు సమాచారం. చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే తమకు హాని జరుగుతుందన్న ఉద్దేశంతోనే చిరంజీవి అభిమానులను రాష్ట్ర ప్రభుత్వం పథకం ప్రకారం సతాయిస్తోందని తెలుసుకున్న నాగబాబు నేడు విజయవాడలో పర్యటిస్తున్నారు.చిరంజీవి అభిమానుల్లో ఆత్మ విశ్వాసం పెంచడమే నాగబాబు పర్యటన ఉద్దేశం. నాగబాబును ఇద్దరు మఫ్టీ పోలీసులు ఇప్పటికీ వెంటాడుతున్నారని చిరంజీవి అభిమానులు చెబుతున్నారు.

No comments: