నిరంతర వార్తా స్రవంతి

Thursday, March 6, 2008

రైతులకు ప్రత్యేకించి రెగ్యులేటరీ కమిషన్: మంత్రి రఘువీరా

రైతుల కోసం ప్రత్యేకించి రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటుచేయనున్నట్లు రాష్త్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి చెప్పారు. గురువారం ఆయన అనంతపురంలో విలేఖరులతో మాట్లాడుతూ రైతులు, వినియోగదారుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. అమెరికా, చైనా, ఇజ్రాయిల్ వంటి దేశాలలో అమలుచేస్తున్న ఆధునిక వ్యవసాయ విధానాలను మన రాష్ట్రంలో కూడా అమలుచేయడానికిగల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సహాయం నేరుగా రైతులకే చేరుతోందని, ఇందులో ఎలాంటి అనుమానాలకూ తావులేదని స్పష్టంచేశారు. రైతులకు ఇస్తున్న అన్ని రకాల ఆర్ధిక సహాయాన్ని వారివారి బ్యాంకు ఖాతాల్లో జమచేసేలా ప్రణాళికలు సిద్ధంచేశామన్నారు.

No comments: