నిరంతర వార్తా స్రవంతి

Thursday, March 6, 2008

చిత్తూరు జిల్లాలో ఆరుగురు విద్యార్ధుల దుర్మరణం

చిత్తూరు జిల్లాలో గురువారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాలలో ఆరుగురు విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు. చంద్రగిరి మండలం పనపాకం గ్రామ పంచాయతీ పరిధిలోని చెరువులో ఈతలు వెళ్లిన ఎనిమిది మంది విద్యార్ధుల్లో నలుగురు మృత్యువాతపడ్డారు. గ్రామానికి కిలో మీటర్ దూరంలోని చెరువులో ఈతకొట్టేందుకు వెళ్ళిన వారిలో పదేళ్ల పవన్ కల్యాణ్, కిరణ్, ప్రసాద్, తొమ్మిదేళ్ల మనోజ్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. అదే విధంగా జిల్లాలోని శ్రీకాళహస్తి మండలం ఎ.ఎం.పుత్తూరు గ్రామానికి చెందిన పదకొండేళ్ల దీక్షు, కల్యాణరెడ్డి స్వర్ణముఖిలో ఈతకొట్టేందుకువెళ్లి ప్రాణాలుకోల్పోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

No comments: