నిరంతర వార్తా స్రవంతి

Saturday, March 1, 2008

చిరు అక్రమార్జనపై కాంగ్రెస్ కన్ను!

హీరో చిరంజీవి ఉగాది నాడు పార్టీ ప్రారంభించనున్న నేపధ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. చిరంజీవిని ఎలాగైనా అప్రదిష్ట పాలు చేయాలన్నది వారి వ్యూహంగా కన్పిస్తోంది.చిరంజీవి ప్రధానంగా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా సమాజ సేవ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఆయనకు జూబిలీహిల్స్ లో విలువైన స్ధలాన్ని బ్లడ్ బ్యాంక్ కోసం ప్రభుత్వం నామ మాత్రపు ధరకు కేటాయించింది. ఇప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మీద, ఐ బ్యాంక్ మీద కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి చిరంజీవి అభిమానులు సిద్ధం కావలసి ఉంది. చిరంజీవి ట్రస్టు వాణిజ్యం చేయడంలేదని, ప్రజాసేవ చేస్తోందని వారు ప్రజలకు చెప్పాల్సిన అవసరముంది.

No comments: