నిరంతర వార్తా స్రవంతి

Friday, March 7, 2008

సత్యసాయిబబా వ్యాఖ్యలపై తెలంగాణలో రగడ!

భగవాన్ పుట్టపర్తి సాయిబాబా ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. ప్రాంతాల వారీగా రాష్ట్రం ముక్కలు కావడం మంచిది కాదని ఆయన సెలవు ఇవ్వడంతో తెలంగాణ వాదులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తెలంగాణలో సత్య సాయి భక్తులు పెద్ద సంఖ్యలో ఉండడంతో బాబా వాక్కు ఇక్కడ సంచలనం సృష్టిస్తోంది.సత్య సాయిబాబా తన హద్దుల్లో తాను ఉండాలిగానీ రాజకీయాల్లో తలదూర్చరాదని టీఅర్ ఎస్ నాయకుడూ హరీష్ రావు వ్యాఖ్యానించడంతో తెలంగాణలోని సత్యసాయి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సామాజిక సేవ చేస్తూ నిరాడంబరంగా జీవిస్తున్న బాబా మీద కమ్యూనిస్టులకు, మావోయిస్టులకు సదభిప్రాయమే ఉంది. ఈ నేపధ్యంలో సాక్షత్తు దైవ స్వరూపుడైన బాబా మీద హరీష్ రావు బురదజల్లడం వివాదాస్పదమైంది.కొన్ని వేలకోట్ల రూపాయలు విదేశీ, దేశీ భక్తుల నుంచి సేకరించిన సత్యసాయిబాబా రాయలసీమలో మంచి నీటి తో సహా అనేక సామాజిక సేవాకార్యక్రమాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. తన ట్రస్టులో మాజీ ఐఎఎస్ , ఐపిఎస్ లను నియమించుకున్న బాబా సైంటిఫిక్ మేనేజ్ మెంట్ ను ప్రవేశపెట్టుకున్నారు. మంచి సేవాభావం గల ప్రముఖులు ట్రస్టులో ఉండడం వల్ల బాబా గారి పని సులభమైపోయింది. బాబా గారికి ఆ భగవంతుడు ఇచ్చిన దూరదృష్టి అది.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా నిన్న సత్యసాయిబాబా ప్రకటిచడం వెనుక ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హస్తం ఉందని హరీష్ రావు విమర్శించడం చర్చనీయాంశమైంది. గతంలో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ పుట్టపర్తి వెళ్ళినప్పటికీ,, బాబా ఆయన పట్ల సానుకూలంగా ప్రతిస్పందించలేదని వార్తలు వచ్చాయి. వైఎస్ కుటుంబం క్రిస్టియన్ మతం స్వీకరించడమే బాబా ముభావానికి కారణమని అప్పట్లో విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ నేపధ్యంలో బాబా వైఎస్ వలలో పడ్డారని టీఅర్ ఎస్ నాయకులు విమర్శించడం ఎంతవరకు సమంజసం?

No comments: