నిరంతర వార్తా స్రవంతి

Friday, March 14, 2008

చరిత్రలో ఐ.సి.ఐ.సి.ఐ.!

సంక్షిప్తంగా ఐసిఐసిఐ (ICICI) అని పిలవబడే ఈ బ్యాంకు పూర్తి నామం భారత పారిశ్రామిక రుణ మరియు పెట్టుబడి సంస్థ (Industrial Credit and Investment Corporation of India). 1955లో దీనిని కేవలం పారిశ్రామిక రుణ అవసరాలకై ప్రారంభించిననూ దేశ బ్యాంకింగ్ రంగంలో ప్రైవేటు సంస్థలను ఆహ్వానించిన సందర్భంలో ఇది కూడా బ్యాంకుగా మారింది. ప్రస్తుతం ఇది దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుగా చెలామణి అవుతున్నది. అంతేకాకుండా ఆస్తుల ప్రకారం చూస్తే దేశంలో రెండో పెద్దది. దేశవ్యాప్తంగా ఈ బ్యాంకుకు 950 శాఖలు మరియు 3600 ఏటియంలు కలవు. 24 మిలియన్ల ఖాతాదారులు (మార్చి 2007 నాటికి), 79 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆస్తులతో (మార్చి 2007 నాటికి) వర్థిల్లుతోంది.

ఖాతాదారుల నుండి డిపాజిట్లను స్వీకరించుట మరియు వ్యక్తులకు, సంస్థలకు రుణాలు ఇవ్వడమే కాకుండా ప్రస్తుతం ఈ బ్యాంకు అనేక రకాలైన సేవలను కలుగజేస్తుంది. భీమా, ఆస్తుల నిర్వహణ, షేర్లు జారీచేయడం లాంటి అనేక కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ బ్యాంకు ఈక్విటీ షేర్లు దేశంలోని ప్రధాన స్టాక్‌ఎక్ఛేంజీలలో నమోదౌతున్నాయి. బాంబే స్టాక్‌ఎక్ఛేంజీ, నేషనల్ స్టాక్‌ఎక్ఛేంజీ, కోల్‌కత స్టాక్‌ఎక్ఛేంజీ, వదోదర స్టాక్‌ఎక్ఛేంజీ లలో కాకుండా న్యూయార్క్ స్టాక్‌ఎక్ఛేంజీలో కూడా దీని షేర్లు లిస్టింగ్ అవుతున్నాయి.

చరిత్ర

1955లో భారత ప్రభుత్వం ఇతర పారిశ్రామిక సంస్థలైన భారత పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (IDBI), చిన్న తరహా పరిశ్రమల్ అభివృద్ధి సంస్థ (SIDBI) లవలె దీనిని కూడా పారిశ్రామిక రుణ అవసరాలకై స్థాపించబడినది. 1990 దశకంలో భారత ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులకు అనుగుణంగా బ్యాంకింగ్ రంగంలో కూడా ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇవ్వవలసి వచ్చింది. దీనికి అనుగుణంగానే ఈ సంస్థ బ్యాంకింగ్ రంగంలో ప్రవేశించి చిన్న ఖాతాదారులకు కూడా సేవలందించడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. బ్యాంకింగ్ రంగంలో ప్రవేశించిన తరువాత 1994లో పేరు కూడా మారింది. కార్పోరేషన్ కాకుండా బ్యాంక్ లిమిటెడ్‌గా పిలువబడుతున్నది. 1999లో న్యూయార్క్ స్టాక్ ఎక్ఛేంజీలో లిస్టింగ్ అయి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సంస్థగా అవతరించింది. 2001లో ఇది 1943లో స్థాపించబడిన బ్యాంక్ ఆఫ్ మధురను విలీనం చేసుకుంది. 2002లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సమావేశమై ఐసిఐసిఐ కు సంబంధించిన అన్ని విభాగాలను ఏకం చేసి ఐసిఐసిఐ బ్యాంకు ఛత్రం కిందుకు తేవాలని నిర్ణయించారు. 2002 ఇది లండన్ మరియు న్యూయార్క్ లలో తన ప్రతినిధులను కూడా నియమించింది. 2003లో ఐసిఐసిఐ కెనడా మరియు యునైటెడ్ కింగ్‌డమ్ లలో అనుబంధ శాఖలను ఏర్పాటుచేసింది. ఇదే ఏడాది దుబాయి, షాంఘైలలో కూడా ప్రతినిధులను నియమించింది. 2004లో బంగ్లాదేశ్ లో ప్రతినిధి కార్యాలయాన్ని ఏర్పాటుచేసింది. 2005లో 4 మిలియన్ అమెరిక డాలర్లు ఆస్తులు కలిగిన రష్యాకు చెందిన ఒక బ్యాంకును విలీనం చేసుకుంది. 2006లో ఐసిఐసిఐ బ్యాంకు యునైటెడ్ కింగ్‌డమ్ బెల్జియం లోని ఆంట్‌వెర్ప్ లో శాఖను ఏర్పాటుచేసింది. ఇదే ఏడాది ఐసిఐసిఐ బాంకాక్, జకర్త మరియు కౌలాలంపూర్ లలో ప్రతినిధి కార్యాలయాలను ప్రారంభించింది. 2007లో ఐసిఐసిఐ మహారాష్ట్రలో 158 శాఖలు, కర్ణాటకలో 31 శాఖలు కలిగిన సాంగ్లీ బ్యాంకును కలిపేసుకుంది. ఖతర్ ప్రభుత్వంచే దోహలో శాఖను ఏర్పాటు చేసుకోవడానికి మరియు న్యూయార్క్‌లో కూడా శాఖను ఏర్పాటు చేసుకోవడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ నుంచి అనుమతిపొందినది. 2008లో ఒక వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. అదే మొబైల్ బ్యాంకింగ్. iMobile అని పిల్వబడే ఈ పథకపు ముఖోద్దేశ్యం ఖాతాదార్లు జిపిఆర్ఎస్ సౌకర్యం ఉన్న మొబైల్ ఫోన్ల నుంచి ఖాతాలను నిర్వహించుకోవచ్చు.

No comments: