నిరంతర వార్తా స్రవంతి

Wednesday, March 5, 2008

జిల్లా యంత్రాంగంపై పట్టుకు శ్రీకాంత్ కృషి!

తనదైన శైలిలో జిల్లా యంత్రాంగంపై పట్టుసాధించేందుకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నాగులాపల్లి శ్రీకాంత్ ప్రయత్నిస్తున్నారు. ఉత్తరాంధ్రలో గతంలో వివిధ హోదాలలో పనిచేసిన ఆయన పొరుగున ఉన్న తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కేంద్రమైన కాకినాడ వాస్తవ్యులని చాలా మందికి తెలియదు. గతంలో పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్ట్ అధికారిగా చేసిన ఆయన తర్వాత అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందా వద్ద కీలక బాధ్యతలు నిర్వహించారు. తర్వాత ఆయన గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా కూడా పనిచేసి తూర్పు గోదావరి పట్ల తన ప్రాంతీయ అభిమానాన్ని చాటుకున్నారు. కొద్ది రోజుల విరామం తర్వాత విశాఖపట్నం నగరపాలక సంస్థ కమిషనరుగా వచ్చిన శ్రీకాంత్ తన సత్తా ఏమిటో నిరూపించుకున్నారు. విశాఖ గ్రేటర్ స్వరూపానికి మారాక తొలి కమిషనరుగా పనిచేసిన ఘనత కూడా ఆయనకే దక్కింది. జి.వి.ఎం.సి. కమిషనరుగా శ్రీకాంత్ తన ప్రత్యేకతను చాటుకున్నట్టే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా సారధిగా కూడా తానేమిటో రుజువుచేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టిన ఆయన గత పరిచయం ఉన్న అధికారులతో చర్చించారు.

No comments: