నిరంతర వార్తా స్రవంతి

Sunday, March 9, 2008

ఆత్మరక్షణలో "ఉండవల్లి"

రామోజీరావుతో ప్రత్యక్ష యుద్ధానికి దిగి ఆయనను ఏమీ చేయలేకపోయిన రాజమండ్రి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారు. అధికార మదం తలకెక్కితే ఎవరైనా పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తారనడానికి ఉండవల్లి అరుణ్ కుమార్ ఉదంతం తాజా ఉదాహరణ.మార్గదర్శి ఫైనాన్సియల్స్ వ్యవహారంరంలో ఒక ముంబయ్ ఫైనాన్స్ కంపెనీ సహకారంతో రామోజీరావు గట్టెక్కారు. రామోజీ సీన్ అయిపోయిందని ప్రచారం చేసిన ఉండవల్లి ఇప్పుడు ఆ విషయంలో మౌనంగా ఉండిపోవలసివచ్చింది. రామోజీరావుతో అనవసరంగా ఘర్షణకు దిగినందుకు కాంగ్రెస్ అధిష్టానవర్గం ఆయనకు మొట్టికాయ వేసినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి నుంచి ప్రత్యక్ష ఎన్నికలో ది గితే రామోజీరావు తమ మీడీయా బలంతో ఓడిస్తారన్న భయం ఇప్పుడు ఉండవల్లికి పట్టుకుంది. అందువల్ల పూర్తిగా పార్టీ సేవలో ఢిల్లీలో ఉండిపోతే ఎలా ఉంటుందని ఆయన అ అలోచిస్తున్నట్టు చెబుతున్నారు.

No comments: