నిరంతర వార్తా స్రవంతి

Sunday, March 9, 2008

ఈనాడును అధిగమించలేదు దానికి వైఎస్సే "సాక్షి"

ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఏకైక తనయుడు జగన్మోహన్ రెడ్డి వ్యవస్ధాపించిన "సాక్షి" దినపత్రిక మార్చి 24 న పాఠకుల ముందుకు రానుంది. ఈనాడు పత్రిక సర్క్యులేషన్ పదిలక్షలు కాగా సాక్షి ప్రింట్ ఆర్డర్ 15 లక్షలు మించిపోయినట్టు తెలుస్తోంది.ఐదు లక్షల సర్క్యులేషన్ వద్ద రెండో స్ధానంలో ఉన్న ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి తమ సమీప ప్రత్యర్ధి సాక్షి అని తెలిసిపోయింది. ఎంతో అట్టహాసంతో ఐదేళ్ళ క్రితం తిరిగి ప్రారంభమైన ఆంధ్రజ్యోతి, ఈనాడును దాటిపోగలమన్న సంకేతాలను ఏజెంట్లకు ఇచ్చింది. ఆంధ్రజ్యోతి విజయవంతమైనా ఈనాడు సర్క్యులేషన్ లో సగం మాత్రమే పొందగలిగింది.సాక్షి ప్రింట్ ఆ ర్డర్ 15 లక్షలు ఉన్నప్పటికీ ఫైనల్ గా ఆ పత్రిక సర్క్యూలేషన్ ఏడు లక్షల వద్ద సెటిల్ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయని ఈ పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. విపరీతమైన ఆర్ధిక బలం, అన్ని కలర్ పేజీలు ఈ పత్రిక ప్లస్ పాయింట్స్ కాగా , నేరుగా కాంగ్రెస్ పత్రిక కావడం, యాడ్ కాంపైన్ తుస్సుమనడం మైనస్ పాయింట్లు.కాంగ్రెస్ బ్రాండుతో ముందుకు వచ్చిన "సూర్య" దినపత్రిక లక్ష కాపీల సర్క్యులేషన్ తో గుంటపూలు పూస్తోంది. ఆ పత్రిక మీద యాజమాన్యం చేస్తున్న ఖర్చులో పది శాతం కూడా వెనక్కి రావడం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో "సాక్షి" ఎంతవరకు విజయవంతమవుతుందో చూడాలి.

No comments: