నిరంతర వార్తా స్రవంతి

Saturday, March 1, 2008

మహిళా మత్స్యకారుల కోసం 'మత్స్య మిత్ర'

రాష్ట్రంలోని మహిళా మత్స్యకారుల కోసం త్వరలో 'మత్స్యమిత్ర' పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి మండలి బుద్ధప్రసాద్ ప్రకటించారు. మహిళా మత్స్య సంఘాలకు ఈ పథకం కింద పావలా వడ్డీకి లక్ష రూపాయల చొప్పున రివాల్వింగ్ ఫండ్‌ను మంజూరు చేయనున్నట్టు చెప్పారు. అలాగే సముద్రంలో వేటాడే మత్స్యకారుల కోసం ముఖ్యమంత్రి రూ.75 కోట్లతో పలు సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్టు బుద్ధప్రసాద్ తెలిపారు.సముద్రంలో వేటాడే సంప్రదాయక మత్స్యకారులు అన్ని రకాల తెప్పలు, బోట్లను రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. యాంత్రిక బోట్లకు డీజిల్ ఆయిల్‌పై ఇస్తున్న రెండు కోట్ల 40 లక్షల రూపాయల సబ్సిడీకి అదనంగా ఈ ఏడాది మరో 98 లక్షలు ఇవ్వనున్నట్టు తెలిపారు.

No comments: