నిరంతర వార్తా స్రవంతి

Saturday, March 22, 2008

పెద్దల సభ తప్పే!

కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానవర్గం సంకేతాలు లేకుండా సభ నిర్వహించాలనుకోవడమే కాంగ్రెస్ సీనియర్ల తప్పిదమని రాష్ట్ర మంత్రులు దామోదరం రాజనర్సింహ, ముఖేష్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ సీనియర్లు భువనగిరి సభను రద్దు చేసుకోవడం హర్షనీయమని వారు శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై తాము పార్టీ అధిష్ఠానవర్గం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వారు చెప్పారు.ప్రజలు నిలదీస్తారనే భయంతోనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఉప ఎన్నికలకు సిద్ధపడ్డారని రాజనర్సింహ విమర్శించారు. ఉప ఎన్నికల్లో ప్రజలు తెరాసకు తగిన గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు. కరీంనగర్ లోకసభ ఉప ఎన్నిక పరిస్థితులు ఇప్పుడు లేవని ముఖేష్ గౌడ్ అన్నారు. ఉప ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పదో తరగతి పరక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పాఠశాల విద్యా మంత్రి రాజనర్సింహ చెప్పారు. ఈ ఏడాదే కొత్త డిఎస్సీ నిర్వహిస్తామని కూడా చెప్పారు.

No comments: