నిరంతర వార్తా స్రవంతి

Saturday, March 1, 2008

ఎంఎంటీఎస్ స్టేషన్లలోనూ రిజర్వేషన్ సదుపాయం

ఇకపై సికింద్రాబాద్‌ నగరంలోని 12ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లలోనూ రిజర్వేషన్ ద్వారా టికెట్లు పొందే సదుపాయాన్ని రైల్వే యంత్రాంగం సిద్దం చేసింది.ఈ సదుపాయం ఈ నెల 15 నుంచి అమల్లోకి రానుంది.చందానగర్,హైటెక్ సిటీ,నేచర్ క్యూర్ ఆసుపత్రి,సంజీవయ్య పార్కు,జేమ్స్ స్ట్రీట్,ఖైరతాబాద్, నెక్లెస్‌రోడ్,లక్డీకాపూల్,సీతాఫల్‌మండి,ఆర్ట్స్‌కాలేజీ,జామే ఉస్మానియా,విద్యానగర్ ప్రాంతాల్లోని ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లలో ఈ సదుపాయాన్ని ప్రారంభించనున్నారు. ఈ కేంద్రాలు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయి.ప్రస్తుతం నగరంలోని 13 ప్రాంతాల్లో ఉన్న రిజర్వేషన్ కేంద్రాల్లో టిక్కెట్లు అందజేస్తున్నారు. తాజాగా ఎంపిక చేసిన ఎంఎంటీఎస్ స్టేషన్లలో కూడా ఈ సదుపాయం కల్పించనున్నారు. ఇక్కడ దేశవ్యాప్తంగా ఏ ప్రాంతానికైనా టిక్కెట్లు లభిస్తాయి.

No comments: