నిరంతర వార్తా స్రవంతి

Saturday, March 22, 2008

రాష్ట్రంలో రాక్షస పాలన: హరికృష్ణ విమర్శ

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు, స్వర్గీయ ఎన్టీ రామారావు కుమారుడు హరికృష్ణ వ్యాఖ్యానించారు. ఆయన శనివారంనాడు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించారు. గుంటూరులో టిఎన్టీయుసి పతాకను ఆవిష్కరించి ఆయన ప్రసంగించారు. కాంగ్రెసు పార్టీని చిత్తుగా ఓడించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. పాలక కాంగ్రెస్ పార్టీవారు డబ్బులు దండుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో రైతులకు నీరివ్వని దౌర్భాగ్య స్థితి నెలకొని ఉందని ఆయన అన్నారు. సిమెంట్, ఐరన్ ధరలు పెరిగాయని, రైతులకు పంటలకు మాత్రం ధరలు పెరగడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. తొమ్మిదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీ అవినీతి రహిత పాలనను అందించిందని ఆయన చెప్పుకున్నారు.

No comments: