నిరంతర వార్తా స్రవంతి

Saturday, March 1, 2008

టూరిస్ట్ స్పాట్‌లలో జైపూర్‌కు ఏడో స్థానం

ఆసియాలోని అత్యంత ఆకర్షణీయమైన టూరిస్టు కేంద్రాలలో జైపూర్ ఏడో స్థానాన నిలిచింది. గులాబీ నగరంగా పిలిచే ఈ రాజస్థానీ రాజధాని అలనాటి రాజులు నిర్మించిన అందమైన ప్రాసాదాలతో అలంకారప్రాయమైన సంగతి తెలిసిందే.ఆ ప్రాభవాన్ని టూరిస్టులు బాగా గుర్తించారన్నందుకు ప్రతీకగా ఇటీవల కోండే నాస్ట్ ట్రావెలర్ మేగజైన్ నిర్వహించిన ఓ సర్వేలో ప్రముఖ నగరాలను సైతం వెనక్కు నెట్టి అది ఏడో స్థానాన్ని ఆక్రమించింది. ఈ జాబితాలో మరే ఇతర భారత నగరానికి చోటు దక్కకపోవడం గమనార్హం.ఈ సర్వే ప్రకారం...థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ 85.8శాతం ఓట్లతో అగ్రస్థానంలో నిలవగా, హాంకాంగ్ 80.4శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. థాయ్‌లాండ్‌లోని మరో పురాతన నగరమైన చియాంగ్ మాయ్ 79.9శాతం ఓట్లతో మూడో స్థానంలోనూ, సింగపూర్ 78.8శాతం ఓట్లతో నాలుగో స్థానంలోనూ, జపాన్‌కు చెందిన క్యోటో 77.7శాతం ఓట్లతో ఐదో స్థానంలోనూ నిలిచాయి.అలాగే చైనాలోని రెండో అతిపెద్ద నగరమైన షాంఘై 76.5శాతం ఓట్లతో ఆరోస్థానంలో, జపాన్ రాజధాని టోక్యో 70.5 శాతం ఓట్లతో ఎనిమిదో స్థానంలోనూ, హనోయ్ 69.8శాతం ఓట్లతో తొమ్మిది, బీజింగ్ 67.3శాతం ఓట్లతో పదో స్థానాల్లోనూ నిలిచాయి.

No comments: