నిరంతర వార్తా స్రవంతి

Saturday, March 1, 2008

వేమన శతకం- ఆరోభాగం

భోగంబుల కాశింపకరాగద్వేషంబు రంగుడదమలోవేగమె మోక్ష పదంబునురాగను నాతండు యోగిరాయుడు వేమా!సుఖ భోగాలు ఆశించకుండా, రాగ ద్వేషాదులను విడిచిపెట్టిన వానికి అతి త్వరగా మోక్ష ప్రాప్తి సిద్ధించును. అతడినే యోగీశ్వరుడని చెప్పుదురని తెలుసుకో.చనువారెల్లను జనులంజనిపోయిన వారి పుణ్య సత్కథలెల్లన్వినవలె గనవలె మనవలెనని మషులకు దెలుసగూడ దంత్యము వేమా!చనిపోయిన మహనీయుల చరిత్రలను శ్రద్ధగా విని, వారి మార్గమునే మోక్ష ప్రాప్తికి ప్రయత్నించాలి. తయ యంత్యములను గూర్చి ఎవ్వరికిని తెలుపరాదు.ఆశయనెడి త్రాళ్ళ నఖిల జనంబులుకట్టుపడుచు ముక్తిగానరైరిజ్ఞానఖడ్గమునను ఖండింప రాదొకోవిశ్వదాభిరామ వినురవేమా!ఆశలు, కోరికలతో బంధితులైన ప్రజలు మోక్షాన్ని పొందలేకపోతున్నారు. జ్ఞానమనే ఖడ్గంతో మాత్రమే ఈ కోర్కెలను, ఆశలను అణచివేయగలమని తెలుసుకో.అతిథి రాక చూచి యదలించి పడవైచికఠిన చితులగుచు గానలేరుకర్మమునకు ముందు ధర్మము గానరోవిశ్వదాభిరామ వినురవేమా!అతిథి ఇంటికి రాగానే అతనిని కోపంతో వెళ్లి పొమ్మని చెప్పిన కఠినాత్ములు ధర్మమును గుర్తించని వారే కాగలరు. ధర్మము చేసిననే కర్మములు నశించగలవని తెలుసుకో.తను వలచిన దావలచును తనువలవక యున్ననెనడు తావలవ డిలన్తనదు పటాటోపంబులు తనమాయలు పనికిరావు ధరలోన వేమా!తాను ఇతరులను ప్రేమిస్తే తనని వారు ప్రేమిస్తారు. తాను ప్రేమించకుంటే వారు కూడా ప్రేమించరు. మాయలు పన్ని మోసాలు చేస్తే ఎవ్వరు కూడా ప్రేమించరు.మాటలాడ వచ్చు మనసు నిల్వగలేదుతెలుపవచ్చు దన్ను తెలియలేదుసురియబట్టవచ్చు శూరుడు కాలేడువిశ్వదాభిరామ వినురవేమమాటలెన్నైనా చెప్పగలరు కానీ, ఆ ప్రకారం నడుచుకోలేరు. ఒకరికి చెప్పుటలో ఉన్నంత ఉత్సాహం తననుతాను గుర్తించడంలో ఉండదు. ఆయుధము పట్టిన ప్రతివాడు శూరుడు కాలేడని తెలుసుకో.తనకేనాడు సుభిక్షముతనకేనాడును భగంబు తనరవయునంచును తన దశకై యెల్లెడమనసందున జివుకుచుండు మహిలో వేమా!తనకెల్లప్పుడు సిరిసంపదలుండవలెననీ, భోగభాగ్యాలు ఉండాలని నరుడు ఆశలోనే మనసు నుంచి చివుకుచుండును. ఆశవల్ల మిగిలేది బాధేనని తెలుసుకో.ఎండిన మా నొకటడవినిమండిన నందగ్ని పుట్టి యూడ్చును చెట్లన్దండిగల వంశమెల్లనుచండాలుండొకడు పుట్టి చదుపును వేమా!అడవిలోని ఎండిన చెట్టు నుంచి పుట్టిన అగ్ని ఆ అడవి మొత్తాన్ని కాల్చును. అలాగే వంశములో ఓ నీచుడు పుడితే ఆ వంశం మొత్తాన్ని నాశనం చేయునని తెలుసుకో.నిజము తెలిసియున్న సుజినుడానిజమునెపలుకవలయుగాని పరులకొరకుచావకూడ దింక నోపదవ్యం పల్కవిశ్వదాభిరామ వినురవేమతనకు నిజము తెలిసిఉంటే నిజాన్నే చెప్పాలి తప్ప అసత్యాన్ని చెప్పరాదు. నిజాన్ని ఎంతమాత్రమూ దాచకూడదు.తామును జనులేమను కొనబూనుదురో దాని సరసి పొందిన జడనీ,రాని పధంబున నడిచినదాననె ధర్మాత్ముడండ్రు తన్నిట వేమా!జనులు తనను నిందింపని రీతిలో నడవడిక కలిగిన వ్యక్తి, తన ప్రవర్తనను ప్రజలు మెచ్చుకొనునట్లు ప్రవర్తించువాడే నిజమైన ధర్మాత్ముడుగా వెలుగొందుతాడని తెలుసుకో.

No comments: