నిరంతర వార్తా స్రవంతి

Thursday, March 6, 2008

జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రభా ఠాకూర్

అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రభా ఠాకూర్ నియమితులయ్యారు. ఈమేరకు ఎ.ఐ.సి.సి. గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభ ప్రస్తుతం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న రీటా బహుగుణ జోషి నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. 1949సెప్టెంబర్ 10న రాజస్థాన్ రాష్ట్రంలోని ఆజ్మీర్ జిల్లా ఉదయ్ పూర్ ఖుర్ద్లో జన్మించిన ప్రభ హిందీ లిటరేచర్లో పిహెచ్.డి. పూర్తిచేశారు. రచయితగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

No comments: