నిరంతర వార్తా స్రవంతి

Saturday, March 1, 2008

మంత్రి ధర్మాన ఫొటో పోజులు!


ఇది కచ్చితంగా ఫొటో పోజే।వసతి గృహాల పరిశీలన పేరిట అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చేపట్టిన హాస్టళ్ల తనిఖీ కార్యక్రమం కేవలం ప్రచార ఆర్భాటంగానే మిగులుతుందన్న విమర్శలకు బలం చేకూర్చేలా శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పర్యటన సాగింది. మందీమార్బలంతో కలిసి మంత్రి నిర్వహించిన హాస్టళ్ల తనిఖీ పలు విమర్శలకు వేదికైంది. నిర్వహణ నిధులను మింగేస్తున్న తమ పార్టీ వాళ్లను వెనకేసుకుని చేసే పర్యటన ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అంచనా వేయవచ్చని ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సమీపిస్తున్న ఎన్నికలకు సమాయాత్తమయ్యామన్న సంకేతాన్ని ఇస్తూ సాగిస్తున్న ప్రచార కార్యక్రమం సత్ఫలితం కన్నా దిష్ఫలితాన్నే ఎక్కువగా ఇచ్చేలా ఉందన్న విమర్శా వినిపిస్తోంది.

No comments: